ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించినట్లుగా విద్యాలయ ప్రిన్సిపల్ గీతా లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను ఆ పాఠశాల హెచ్ఎం సంతకంతో సమర్పించాలన్నారు.