జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద కౌలు 45వేల కౌలు కార్డులను జారీ చేసేందుకు లక్ష్యంగా ఉంచుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 42, 033 కార్డులను జారీ చేయడం జరిగిందని తెలిపారు. కౌలు కార్డుల కొరకు దరఖాస్తు చేసుకొని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.