గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గo పెదనందిపాడు గ్రామంలో గురువారం రాత్రి లావు వారి చెరువు వద్ద ఉన్న షేక్ సుభాని టి దుకాణం పగలగొట్టి రూ. 10 వేల నగదు తో పాటు సిగరెట్టు పెట్టెలను దొంగలు అపహరించుకుపోయారు. శుక్రవారం ఉదయం యజమాని షేక్ సుభాని దుకాణం వద్దకు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. పెదనందిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.