సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన భద్రత చర్యలు సత్ఫలితం

60பார்த்தது
వాడరేవు బీచ్ లో ఆదివారం సముద్రంలో స్నానం చేస్తున్న నరసరావుపేటకు చెందిన యువకుడు అలల తాకిడికి కొట్టుకుపోతుండగా గమనించిన పోలీసులు, గజ ఈతగాళ్లు కాపాడి ఒడ్డుకు చేర్చారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చొరవ తీసుకొని సముద్ర తీరంలో చేయించిన భద్రతా చర్యలు సత్ఫలితం ఇచ్చి ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్లు అయింది. ఇందుకుగాను పర్యాటకులు ఎమ్మెల్యే కొండయ్యకి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி