AP: గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించనున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్గా మాట్లాడుతారు. ఆ తర్వాత పీ-4 కార్యక్రమంలో పాల్గొంటారు. మార్గదర్శి బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమై పలు సూచనలు చేస్తారు.