కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్

65பார்த்தது
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారిని బుధవారం మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి ప్రత్యేక జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி