ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సత్తా చాటాలి: ఎమ్మెల్యే

65பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సత్తా చాటాలి: ఎమ్మెల్యే
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించి, మరలా సత్తా చాటాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. డివిజన్ అధ్యక్ష, కార్యవర్గంతో పాటు, కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, క్లస్టర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி