రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెత్త పన్నును రద్దు చేస్తూ ఎన్నికల హామీని నెరవేర్చాడని చీరాల ఎమ్మెల్యే కొండయ్య సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియచేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం వలన చెత్త పన్ను నుండి ప్రజలకు ఉపశమనం కలిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు అవుతాయని ఆయన చెప్పారు.