‘పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

నరసరావుపేట మండలంలోని యల్లమంద గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతుకు వ్యవసాయం సులభతరంగా, లాభసాటిగా మార్చేందుకు నూతన సాంకేతిక పద్ధతులను తెలియజేయడం ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி