‘పుష్ప-2 ది రూల్’ టీమ్కు ధన్యవాదాలు చెబుతూ నటి రష్మిక ఆదివారం ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "పుష్ప-2 థాంక్యూ మీట్లో నేను పాల్గొనలేకపోయా. సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థాంక్యూ. శ్రీవల్లిగా చెప్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు థాంక్యూ" అని ఆమె పేర్కొన్నారు.