యాదాద్రి: TGOS అధ్యక్షులుగా జగన్మోహన్ గౌడ్ నియామకం

69பார்த்தது
యాదాద్రి: TGOS అధ్యక్షులుగా జగన్మోహన్ గౌడ్ నియామకం
యాదాద్రి జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధికారుల 2024 - 27 సంవత్సర ఎన్నికలు బుధవారం భువనగిరిలో నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న జగన్మోహన్ గౌడ్ అధ్యక్షులుగా, భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ ప్రధానకార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగులు వారికి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ముందుంటామన్నారు.

தொடர்புடைய செய்தி