హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు రెచ్చిపోయారు. తమ బంధువులు వస్తారని నార్కెట్పల్లిలో బస్సు ఆపమని డ్రైవర్ను కోరగా.. దాదాపు 10 నిమిషాలు ఆపారు. ఆ తర్వాత వేరే ప్రయాణికులు ఎంతసేపు బస్సు ఆపుతారని ఆడగడంతో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో ఆ మహిళలు డ్రైవర్ను బూతులు తిట్టారు. తమ విధులకు ఆటంకం కలిగించడంతో వారిపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.