60శాతం కాలేయం దానం.. మ‌హిళ‌ మృతి

53பார்த்தது
60శాతం కాలేయం దానం.. మ‌హిళ‌ మృతి
కర్ణాటకలోని మంగళూరులో 33 ఏళ్ల అర్చన కామత్ అనే మహిళ తన కాలేయంలో 60% దానం చేసిన కొన్ని రోజుల తర్వాత మరణించింది. లెక్చ‌ర‌ర్‌గా పని చేస్తున్న అర్చనకు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శస్త్రచికిత్స అనంతరం ఇన్ఫెక్షన్‌కు గురై ఆమె చనిపోయినట్లు సమాచారం. కాగా తన అత్త సోదరిని సొంత అమ్మలా భావించి ఆమె కాలేయాన్ని దానం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆమె త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி