వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ.. "పిన్నెల్లి అరెస్ట్పై మాకు సమాచారం లేదు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు చెప్పారు. ఆయన కోసం గాలిస్తున్నాం.. పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నట్లు మాకే తెలియదు." అని పేర్కొన్నారు.