ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 70 వినతులను ప్రజలు సమర్పించారు. ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.