వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తుపదార్థాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలంతో కాజీపేట రైల్వే స్టేషన్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల బ్యాగ్ లతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సీఐ సురేష్, ఆర్ఐ శివకేశవులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.