అక్టోబర్ రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో దేవాదాయ, రెవెన్యూ, విద్యుత్, సాగునీటిపారుదల, మున్సిపల్, పోలీస్, మత్స్య, తదితర శాఖల అధికారులతో పాటు వేయి స్తంభాల గుడి, పద్మాక్షమ్మ దేవాలయ అర్చకులతో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు.