వరంగల్ శివనగర్ మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5500 నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం స్నానం చేయడానికి పై అంతస్తుకి వెళ్లిడంతో గదికి వేసినతాళం పగులగొట్టి ఉండటం గమనించి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దొంగతనం జరిగిందని భావించి మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం ఇవ్వగా జాగిలాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.