విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

59பார்த்தது
విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పాలిసెట్ 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పోచయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంట వరకు పరీక్ష ఉంటుందని విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி