సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంలోని పాలకుర్తి రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో పాల్గొంటారు. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, మునుపెన్నడూ లేనివిధంగా 850 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.