జనగామ జిల్లా చిల్కూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.