ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పేద పిల్లలకు ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి కిందిస్థాయి పిల్లలకు అబాకస్, గణితం, ఆంగ్ల పఠనంతో పాటు వ్యక్తిత్వ వికాసం తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9951193673 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.