నల్లబెల్లిలో భారీ కొండచిలువ కలకలం

73பார்த்தது
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 7 అడుగుల పొడవున్న కొండచిలువ సబ్స్టేషన్ ప్రాంతంలోని పత్తి చేనులో సంచరిస్తూ కనిపించడంతో కూలీలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని పాములు పట్టే పిట్టల రమేశ్ కు తెలియజేశారు. పత్తి చేనులో దాగి ఉన్న కొండచిలువను రమేష్ చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అందజేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులు అడవిలో వదిలిపెట్టారు.

தொடர்புடைய செய்தி