నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

78பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అర్షద్ అహ్మద్ తెలిపారు. గోదావరి పరివాహకం వెంట ముంపు ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ స్తంభాలను వేస్తున్న కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వాజేడు నుండి ధర్మవరం వరకు ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.

தொடர்புடைய செய்தி