ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అర్షద్ అహ్మద్ తెలిపారు. గోదావరి పరివాహకం వెంట ముంపు ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ స్తంభాలను వేస్తున్న కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వాజేడు నుండి ధర్మవరం వరకు ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.