ఏటూరునాగారంలో బీభత్సం సృష్టిస్తున్న కోతులు

58பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఫ్రూట్ షాపులు, వ్యాపార సముదాయాల్లో దూరి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇళ్ల ముందు పార్కు చేసిన వాహనాలను ధ్వంసం చేస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇటీవల పలువురిపై కోతులు దాడి చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. గ్రామపంచాయతీ అధికారులు కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி