శాకాంబరీ అవతారంలో దుర్గామాత

58பார்த்தது
శాకాంబరీ అవతారంలో దుర్గామాత
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారు నేడు ఆదివారం శాకాంబరరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు, అర్చకులు వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పళ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி