పాత సామాగ్రి షాపులో అగ్ని ప్రమాదం

3324பார்த்தது
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా పెట్రోల్ బంకు సమీపంలో పాత సామగ్రి కొనుగోలు షాపులో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టుపక్కల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி