సామూహిక గిరి ప్రదక్షిణలో పాల్గొన్న జనగాం భక్తులు

81பார்த்தது
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో నూతనంగా ప్రారంభించిన సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జిల్లా కేంద్రమైన జనగాం నుండి, అలాగే పాలకుర్తి నుండి పలువురు భక్తులు పాల్గొన్నారు. మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేసారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ఉచిత దర్శనం కల్పించారు.

தொடர்புடைய செய்தி