వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

55பார்த்தது
వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని, గిర్నిబావి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులలోని ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు వార్డెన్, ప్రిన్సిపాల్ లకు తగు సూచనలు చేశారు. అనంతరం హాజరు పట్టికలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி