భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో 1. 70 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను బుధవారం శంకుస్థాపనలు చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహ ఆవిష్కరణ మంత్రి శ్రీధర్ బాబు చేసారు. ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో వారికి సన్మానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలవుతాయని అన్నారు.