జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రవేట్ ఎలక్ట్రీషియన్ రాజిరెడ్డి విద్యుత్ షాక్ తో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం విద్యుత్ స్తంభం వద్ద కరెంటు పని చేస్తుండగా ప్రమదవశత్తు షాక్ కు గురి కావడంతో ఎడమకాలు, రెండు చేతులు ముడుచుకొని పోయి పరిస్థితి విషమింగా వుంది. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.