దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

51பார்த்தது
ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం పరిగి పట్టణంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంలో మహిళలు బ్రేక్ డాన్స్ చేస్తూ ప్రయాణిస్తున్నారని కేటీఆర్ మహిళలను కించపరచినట్లు మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி