అరకు లోక్సభ ఫలితాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక్కడ
వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజారాణి గెలిచినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఇక్కడ కౌంటింగ్ పూర్తైనా ఫలితం ఆగిపోయింది. 11,45,426 ఓట్లు పోలైనట్లు గతంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా 11,37,917 ఓట్లను మాత్రమే లెక్కించడంతో
బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రశ్నించారు. 7509 ఓట్లు గల్లంతు కావడంపై ఫిర్యాదు చేయడంతో తొలుత ఫలితం ప్రకటించలేదు.