శ్రీకాకుళంలో తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి

61பார்த்தது
శ్రీకాకుళంలో తేనెటీగల దాడిలో ఇద్దరు కూలీలు మృతి
పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టడంతో కూలీలు భయంతో పరుగులు పెట్టారు. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు. మరో ముగ్గురు కూలీలు గాయపడగా గ్రామస్థులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி