TG: నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. అచ్చంపేట మండలం చెదురుబావి తండాకు చెందిన ఇద్దరు రైతులు కరెంట్ షాక్ కు గురై మరణించారు. తండాకు చెందిన కాట్రవత్ లూక్యా, మూడవత్ కుమార్ పొలంలో వరి నాట్లు వేశారు. నీరు పెట్టేందుకు బుధవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లారు. బోరు వైరు పనిచేయకపోవడంతో దానిని బాగు చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృతితో తండాలో విషాదం చోటుచేసుకుంది.