గుడిలో కూర్చుని ఉండగా కిటికీ నుంచి మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ (వీడియో)

73பார்த்தது
కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు గుడిలో శ్లోకాలు చదువుతుండగా ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ శంకర్ నగర్‌లోని వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி