ఆరో దశ ఎన్నికల్లో పోటీలో ఉన్న అత్యంత ధనిక అభ్యర్థి నవీన్ జిందాల్. ఆయన హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,241 కోట్లు. ఆ తర్వాత రూ. 482 కోట్లతో ఒడిశాలోని కటక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రెండో సంపన్నుడిగా నిలిచారు. ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తా రూ. 169 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.