అత్తమామలకు మత్తుమందు ఇచ్చి బైక్‌పై పారిపోయిన కొత్త కోడలు

55பார்த்தது
అత్తమామలకు మత్తుమందు ఇచ్చి బైక్‌పై పారిపోయిన కొత్త కోడలు
రాజస్థాన్‌లోని బుందిలో 24 ఏళ్ళ కొత్త కోడలు తన అత్తమామలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి.. మోటార్‌సైకిల్‌పై వారి ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు తెలిపారు. "ఆగస్టు 23న దుర్గాశంకర్ గుర్జర్(24) అనే వ్యక్తి మంజూబాయి(24) అనే యువతిని 'నాట-ప్రథ' ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఈ పద్ధతిలో పెళ్లి పేరుతో ఆడపిల్లలను విక్రయిస్తారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అత్తమామలను ఆసుపత్రికి తరలించారని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని" పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி