సుఫారీ తీసుకొని ముంబైలో ఒకరిని చంపి, బేరం కుదరకపోవడంతో కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని చంపిన కిల్లర్లు

52பார்த்தது
సుఫారీ తీసుకొని ముంబైలో ఒకరిని చంపి, బేరం కుదరకపోవడంతో కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని చంపిన కిల్లర్లు
సుఫారీ తీసుకొని ఒకరిని చంపిన కిల్లర్లు, బేరం కుదరకపోవడంతో కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని కూడా చంపారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీర్ ఖానాదా అనే వ్యక్తిని సుమీత్ జైన్ అనే ప్రాపర్టీ డీలర్ సుఫారీ ఇచ్చి ఇటీవల హత్య చేయించాడు. ఆ హత్యను కిడ్నాపర్ల చర్యగా చిత్రీకరించేందుకు సుమీత్ కూడా తుపాకీతో కాలిపై కాల్చుకున్నాడు. ఈ హత్య అనంతరం డబ్బు విషయంలో సుమీత్ మాట మార్చడంతో, ఆ కాంట్రాక్ట్ కిల్లర్లు అతడిని కూడా పొడిచి చంపారని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி