ఉత్తరప్రదేశ్ హాపూర్లోని అశోక్నగర్లో వివాహ వేదిక యుద్ధక్షేత్రంగా మారింది. పెళ్లిలో వధూవరులు వరమాలలు వేసుకునే సమయంలో వరుడు వధువును ముద్దాడాడు. దీన్ని చూసిన వధువు బంధువులు ఆగ్రహంతో వరుడి బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలతో వరుడి బంధువులపై దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.