ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల్లో ఘరానా మోసం వెలుగుచూసింది. విజిలెన్స్ అధికారులు మూడు పెట్రోల్ బంకుల్లో దాడులు నిర్వహించగా పెట్రోల్, డీజిల్ కొలతల్లో మార్పులు చేసి వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు వరకు కొల్లగొట్టినట్లు తేలింది. అనంతపురం శివారులోని సోమలదొడ్డి వద్ద పెట్రోల్ బంకులో ఏటా దాదాపు 2.80 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ తక్కువగా పోస్తూ 2.70 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తేల్చారు.