క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కు ప్లేయింగ్ ఎలెవెన్ లో మార్పు చేయాలని హైదరాబాద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కరమ్ స్దానంలో గ్లెన్ ఫిలిప్స్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.