పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు పూజిద్దామని మున్సిపల్ చైర్ పర్సన్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్పై చైర్ పర్సన్ మట్టి గణపతుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పెద్దపల్లిలో ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆకుల వెంకటేశ్ పాల్గొన్నారు.