రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రహీంఖపేట గ్రామానికి చెందిన అనూహ్య అనే మహిళ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక్కసారిగా ఇంట్లో కేకలు వినబడడంతో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న గడ్డమిది శ్రీనివాస్ స్పందించి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి ఆమెకు సీపీఆర్ చేశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తన సొంత వాహనంలో తరలించారు. ఇప్పుడు అనూహ్య పరిస్థితి నిలకడగా ఉంది.