కరీంనగర్ మండలం నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆషాడ శాకాంబరీ ఉత్సవాలలో భాగంగా శనివారం అమ్మవారికి క్యారెట్ మాలలను అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మన్, కమిటి బాధ్యులు, భక్తులు పాల్గోన్నారు.