110 మంది ఎక్కడంతో బస్సు ఆపేసిన డ్రైవర్

1087பார்த்தது
ఆర్టిసి బస్సులో లోడ్ ఎక్కువ కావడంతో డ్రైవర్ మధ్యలోనే ఆపేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వెళ్తుండగా.. హుజురాబాద్లో 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది ఎక్కారు. దీంతో సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని డ్రైవర్ బస్సును ఆపేశారు. కొంతమంది ప్రయాణికులు దిగాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி