బోయినపల్లి మండలం తడగొండ గణేష్ యూత్ ఆధ్వర్యంలో శనివారం మట్టి గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చవితి పండుగ సందర్భంగా మట్టి గణపతి ప్రతిమను పూజించడం జరుగుతుందని పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అని ఈ సందర్భంగా వారు తెలిపారు. గణేష్ యూత్ సభ్యులు, భక్తులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.