హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన

53பார்த்தது
హుస్నాబాద్ నియోజకవర్గంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటించారు. వివిధ మండల కేంద్రాలు గ్రామాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోహెడ మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. అక్కడే టీ కొట్టు వద్ద స్థానికులతో ముచ్చటించారు. త్వరలోనే రేషన్ కార్డులు, ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி