ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో నగర మహారాజ్, శంకర భారతిలను సోమవారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత కోసం చేసిన కృషి అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.