మధ్యాహ్న భోజన వివరాలు ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు మొబైల్ యాప్ లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఆదేశించారు. పాఠశాలలో ఎంత మంది భోజనం చేశారో.. వివరాలను మధ్యాహ్నం రెండు గంటల వరకు యాప్ లో నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.